దారి తప్పుతున్నా యువకులు
ప్రేమ కోసం ప్రాణాలు కోల్పోతున్నా యువకులు

..ప్రేమిస్తున్నారు… వేదిస్తున్నారు… పెళ్లైనా… పిల్లులున్నా కామవాంచ తీర్చాలని వేదిస్తున్నారు. వేదింపులతో కీచకులుగా మారుతున్నారు…ఆ వేదింపుల పై ప్రేమికురాళ్లు తిరగబడుతున్నారు… నడిరోడ్డు పై బండలతో బాదుతున్నారు.. కీచకులను బలీస్తున్నారు.. ప్రేమ కోసం యువకులు ఎందుకు రాక్షసులుగా మారతున్నారు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమోన్నాదీల అరాచకం పై ప్రత్యేక కథనం.
.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యువకులు ప్రేమ కోసం ఉన్మాదిలుగా మారుతున్నారు.. ఉంటే నాతోనే ఉండాలంటున్నారు… ప్రేమికురాలు కాదన్నా.. ఇష్టం లేదన్నా… ప్రేమికులు ఉగ్రవాదులుగా మారుతున్నారు… కలిసి ఉన్నా పోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పంపుతున్నారు… షేర్ చేస్తూ ప్రేమికురాళ్ల పరువును తీస్తున్నారు..
.. ప్రేమోన్మాదిల అరాచకాల పై బాదితురాళ్లు న్యాయం కోసం ఠానాకు వెళ్లుతున్నారు..న్యాయం చేయాలని కోరుతున్నారు… బాదితుల పిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేస్తున్నా యువకుల తీరు మారడం లేదు… వేదింపులు అపడంలేదు…ప్రేమించిన యువతుల కుటుంబాలకు నరకాన్ని చూపిస్తున్నారు.. పరువు తీస్తున్నారు.మానం తీస్తున్నారు… ఆ పరువు పోవడాన్ని తట్టులేక యువతి భర్త ప్రాణాలు తీసుకున్నా సంఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.. ముస్కే మహేష్ , ఇందారం గ్రామాని చెందిన శ్రుతి ప్రేమించుకున్నారు…అత్యంత సన్నిహితంగా ఉన్నారు.. కాని శ్రుతి యువతికి మరోక. యువకునితో పెళ్లి చేశారు. కాని మహేష్ తీరులేదు… ప్రేమించిన యువతి శ్రుతికి పెళ్లైనా తర్వాత వేదించాడు…రకరకాల చిత్రహింసలకు గురి చేశాడు.ఏకంగా శ్రుతితో సన్నిహితంగా ఉన్నా న్యూడ్ పోటోలు, విజువల్ సోషల్ మీడియా షేర్ చేశాడు..ఆ వీడియోలు చూసి పరువు పోయిందని శ్రుతి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు
.భర్త చనిపోయిన తర్వాత కూడ శ్రుతిని వేదించడం అపలేదు…మహేష్ వేదింపులను శ్రుతి కుటుంబ సభ్యులు తట్టుకోలేక పోయారు… వేదింపులతో నరకాన్ని చూపిస్తున్నా మహేష్ అంతమొందించాలని పథకం రూపోందించారు..ఆ పథకంలో భాగంగా ఇంటిముందు వెళ్లుతున్నా మహేష్ పై శ్రుతి , తల్లిదండ్రులు కనుకయ్య, పద్మ, సోదరి, తమ్ముడు ఒక్కసారిగా దాడి చేశారు… దాడి చేయగానే మహేష్ బైక్ పై నుండి క్రింద పడ్డారు..ఆ తర్వాత. కత్తితో దాడి చేశారు… అంతేకాదు బండరాయితో బాదారు.. చచ్చేంత వరకు కసి తీరా కోట్టి ప్రాణాలు తీశారు… చంపిన అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయారు… మహేష్ వేదింపులు భరించలేక ఈ హత్యకు పాల్పపడ్డారని పోలీసులు వేల్లడించారు..
.. మంచిర్యాల. జిల్లా లో ప్రేమికునిహత్య మరువకముందే. ఆదిలాబాద్ జిల్లా గర్ఖంపేటలో జంట హత్య జరిగింది .వివాహిత. ఆశ్వీని, అమే ప్రియుడు రేహ్మన్ ను ఆశ్వీన్ భర్త రమేష్ కొట్టి చంపాడు.. గత కోన్ని రోజులుగా రమేష్ కు, ఆయన భార్య ఆశ్వినికి విబేదాలు వచ్చాయి. విబేదాలతో ఆశ్విని వేరుగా ఉంటుంది.. ఇదే సమయంలో రహ్మన్ తో అక్రమ సంబంధం ఏర్పడింది… అశ్వినికి ఇద్దరు పిల్లలు ఉన్నారు . అయినప్పటికీ దారి తప్పిన అశ్విని రహ్మేన్ తో కలిసి తిరుగుతోంది…అందులో బాగంగా గర్కంపేట లోని మారుమూల ప్రాంతానికి వెళ్లారు ఆశ్విని, రహ్మాన్ వెళ్లారు.. ఈ విషయం కోడుకు ద్వారా తెలుసుకోని ఆ ప్రాంతానికి చేరుకున్నాడు భర్త రమేష్…అక్కడ భార్య అశ్విని, రహ్మన్ తో కలిసి ఉన్నది చూశాడు..ఇదే విషయాన్ని రమేష్ తన ఇద్దరు చెల్లేలు, బావ వెంకటేశ్ కు సమాచారం ఇచ్చాడు… కుటుంబ పరువు తీస్తున్నా ఆశ్విని , రహ్మన్ చంపాలని నిర్ణయించుకున్నారు రమేష్..అందులో బాగంగా రమేష్, ఇద్దరు చెల్లేల్లను , బావ వెంకటేష్ ను ఆదిలాబాద్ నుండి ఆ ప్రాంతానికి పిలిపించాడు రమేష్…. ఆ తర్వాత. రమేష్ ఆశ్విని తో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నా రహ్మన్ కర్రతో దాడి చేసి చంపాడు.. రహ్మన్ చంపిన తర్వాత. ఆశ్విని చంపడానికి ప్రయత్నించాడు భర్త… ఆశ్విని పారిపోవడానికి ప్రయత్నాన్ని రమేష్ చెల్లేలు , బావ వెంకటేష్ అడ్డుకున్నారు… పారిపోకుండా పట్టుకున్నారు. వెంటనే రమేష్ కర్రతో ఆశ్విని పై దాడి చేశాడు .. ప్రాణాలు తీశాడు… ఇద్దరిని చంపిన తర్వాత అక్కడి నుండి రమేష్ , ఇద్దరు చెల్లేలు, బావ వెంకటేష్ పారిపోయారు..అయితే పోలీసులు సీసీ పుటేజీ ఆదారంగా నిందితులను అరెస్టు చేశారు..ఈ జంట హత్యకు అక్రమ సంబంధం తో బార్య పరువు తీస్తుందని జంట హత్య చేసినట్లు పోలీసు విచారణలో తెలిందని వెల్లడించారు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి..
. ఈ రెండు సంఘటనలు మరుకవముందే. జైపూర్ మండలం వేలాల గ్రామానికి చెందిన శ్యామ్ ప్రేమ కోసం బలయ్యాడు..శ్యామ్ గత కొన్ని రోజులుగా అదేగ్రామానికి చెందిన. యువతితో ప్రేమాయణం కోనసాగిస్తున్నాడు.. ఇదే విషయం అమ్మాయి తల్లిదండ్రులకు కోపాన్ని తెప్పించింది.. తమ కూతురును ప్రేమ పేరుతో వేదిస్తున్నాడని యువతి తల్లిదండ్రులు పోలీసులకు శ్యామ్ పై పిర్యాదు చేశారు..పిర్యాదు తో కేసులు నమోదయ్యాయి…. కాని కోర్టు పేసీలకు హజరుకాలేదు శ్యామ్ … దాంతో కోర్టు అరెస్టు వారంట్ జారీ చేసింది.. అరెస్టు వారంట్ జారీ చేయడంతో శ్యామ్ ను పోలీసులు అరెస్టు చేశారు.. లక్షిట్ పెట. జైలు లు తరలిస్తుండగా అక్కడ పురుగుల మందు త్రాగాడు.ఆత్మహత్య యత్నం చేశాడు .. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తరలించారు… గాందీలో చికిత్స పోందుతూ శ్యామ్ ప్రాణాలు కోల్పోయాడు.. అయితే శ్యామ్ మ్రుతికి యువతి ప్రేమ కారణమని ఆరోపిస్తూ శ్యామ్ బందువులు శవంతో గ్రామంలోఅందోళన చేపట్టారు.. న్యాయం చేయాలని కోరుతున్నారు..శ్యామ్ మ్రుతికి కారణమైనా యువతి, ఆమె బందువుల పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు