నిరుద్యోగుల సభలో సర్కార్ పై యుద్దం ప్రకటించిన. రేవంత్
కాంగ్రెస్ అదికారంలోకి వస్తే ఖాళీలు భర్తీ చేస్తాము..

ఖమ్మం
రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నాపత్రాలు బజార్లో దొరుకుతున్నాయన్నారు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి….
ఖమ్మం నగరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీ కార్యక్రమం కు హాజరైన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీక్ వ్యవహారంలో పంపకాల్లో తేడాలు వచ్చి విషయం బయటపడింది తప్ప ప్రభుత్వం చేసిందేం లేదన్నారు..మేం నిలదీస్తే విచారణ అధికారులు మాకు నోటీసులు ఇచ్చారన్నారు..కొడుకును మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటే కేసీఆర్ నాకు నోటీసులు పంపిండన్నారు..నాపై ఇప్పటికే..130 కేసులు పెట్టినవ్ కేసీఆర్… ఇంతకంటే ఇంకేం చేస్తావ్ అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి…
హైదరాబాద్ లో జరిగే నిరుద్యోగ నిరసన సభకు ప్రియాంక గాంధీ హాజరవుతారన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి….ప్రియాంక గాంధీ సభను విజయవంతం చేయాలని ఖమ్మం జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు…మంత్రి అజయ్ కుమార్ ను టార్గెట్ గా చేసి విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి…ఖమ్మం జిల్లాలో ఒంటి కన్ను శివరాసన్ ను పాతాళానికి తొక్కేయాలన్నారు..జిల్లాలో 10కి 10 సీట్లు కాంగ్రెస్ కు ఇస్తే..రాష్ట్రంలో నూటికి 90 సీట్లు తెచ్చే బాధ్యత మేం తీసుకుంటామన్నారు..
రాష్ట్రంలో 50లక్షల మంది విద్యార్థి నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందన్న రేవంత్..1969లో మా ఉద్యోగాలు మాకు కావాలంటూ తెలంగాణ ఉద్యమం ఖమ్మం జిల్లాలోనే మొదలైందన్నారు..
నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం కావాలని కేసీఆర్ చెప్పిండని..తెలంగాణ వచ్చి తొమ్మిదేళ్లయినా నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదన్నారు…తెలంగాణ ఏర్పడిన తరువాత 1లక్ష 7వేలు ఖాళీలు ఉన్నాయని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారని..
2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని బిస్వాల్ కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు రేవంత్ రెడ్డి..తొమ్మిదేళ్లలో ఉన్న ఉద్యోగాలు పోయాయి తప్ప.. కొత్త ఉద్యోగాలు రాలేదన్నారు..80వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటే కేసీఆర్ మారిండేమో అనుకున్నామని..కానీ ఇవాళ జరిగిందేంటో మీకు తెలిసిందేనన్నారు.. కాంగ్రేస్ అదికారంలోకి వస్తే ఉద్యోగాలు భర్తీ చేస్తామని భరోసానిచ్చారు