పోడు భూములకు మరో యుద్దానికి సిద్దమవుతున్నా అదివాసీలు
తీర్మానాలు లేకుండా పోడు భూములు ఇవ్వాలని డిమాండ్

.. అడవి బిడ్డల మరో ఉద్యమం. సాగు చేసుకుంటున్నా పోడు భూములకు హక్కుపత్రాలు ఇవ్వాలని పుడమి బిడ్డల. సమరం… గ్రామాల. తీర్మానం లేకుండా హక్కు పత్రాలు ఇవ్వాలని . పోరాటానికి సై అంటున్నా అదివాసీలు.. ఎస్టీ జాబితాలో పదకోండు కులాలను చెర్చడాన్ని వ్యతిరేకంగా అదివాసీలు తిరుగు బాటు చేస్తున్నారు… ఆ ప్రతిపాదన విరమించుకోవాలని సర్కారు అల్టీమేటమ్ జారీ చేశారు. పోడు భూముల కోసం అదివాసీ బిడ్డల. మరోపోరాటం పై ప్రత్యేక కథనం
.. పోడు భూముల పై సీఎం కేసీఆర్ ప్రకటనను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.. పోడు భూములు ఇవ్వాలంటే గ్రామ సభలు తీర్మానం చేయాలని సీఎం సంచలన. వ్యాఖ్యలు చేశారు.. అదేవిధంగా మరోపదకోండు కులాలను చెర్చాలని కోరుతూ అసెంబ్లీ తీర్మానం చేసింది..
…ఈ రెండు అంశాలను అదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు..ప్రదానంగా పోడు భూములు ఇవ్వాలంటే… రకరకాల నిబంధనలు పెడుతున్నారు.ప్రదానంగా పోడు ఇవ్వాలంటే గ్రామ సభలు, సర్పంచ్ లు, ఎంపిటీసీలు తీర్మానాలు చేయాలనే ప్రతిపాదనను అదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.. ఆ నిబంధనలు ఎత్తి వేయాలని అదివాసీలు డిమాండ్ చేస్తున్నారు…
ఏపథకానికి లేని నిబంధనలు… పోడు భూముల హక్కు పత్రాలు ఇవ్వడానికి తీర్మానాలు ఎందుకు అమలు చేస్తామని ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.. అందులో బాగంగా తీర్మానం ప్రతిపాదనలు ఉపసంహరించాలని ఉద్యమానికి సిద్దమవుతున్నారు…ఈ ప్రక్రియ లో బాగంగా ఈనెల ఇరవైనా ఉట్నూరు ఐటిడిఎ కార్యాలయం ముట్టడికి అదివాసీ సంఘాలు పిలుపునిచ్చాయి.
. ఈముట్టడికి వేలాది మందిని తరలిస్తామంటున్నారు.. తీర్మానాలు ఉపసంహరించే ప్రకటన. చేసేంతవరకు పోరాటాన్ని సాగిస్తామని అదివాసీలు సర్కార్ ను హెచ్చరించారు….పోడు భూముల తోపాటు. అదివాసీలు పదకోండు కలాలను ఎస్టీ జాబితాలోచెర్చుతూ తీర్మానం చేసింధి…ఆ తీర్మానాన్ని అదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు గిరిజనులు… ఇప్పటికే లంబడాల. వల్ల తమకు రిజిస్ట్రేషన్ పలాలు అందడం లేదని అందోళనవ్యక్తం చేస్తున్నారు పైగా లంబడాలను తోలగించాలని ఉద్యమం చేస్తుంటే ..మళ్లీ కోత్తగా కులాలను చెర్చుతు చేసిన తీర్మానాన్ని అదివాసీలు ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నారు… లేదంటే ఉద్యమాన్ని ఉద్రుతం చేస్తామంటున్నారు… ఒకవేళ సర్కారు దిగిరాకపోతే బిఅర్ ఎస్ లో గిరిజన ప్రజాప్రతినిదులు రాజీనామాలు చేసేలా ఓత్తిడి తెస్తామంటున్నారు.. ఈనెల ఇరవైన. ఖానాపూర్ లో మంత్రి కేటీఅర్ ను అడ్డుకుంటామంటున్నారు..తమ. డిమాండ్ల పై సర్కారు దిగివచ్చేంతవరకు పోరాటం అగదని హెచ్చరిస్తున్నారు అదివాసీలు