మంచిర్యాల జిల్లాలో పామ్ ల్యాండ్ దోపిడి దందా

ముప్పై లక్షలతో కోనుగోలు చేస్తే కోట్ల ఆదాయమంటూ ప్రజలను మోసం చేస్తున్నా రియల్ మాపియా

.  అది  రియల్ మాపియా రాజ్యం.. ఆ దోపిడి  రాజ్యంలో   సర్కార్  భూములు   రియల్  ఎస్టేట్  వేంచర్లుగా   మార్చుతోంది మాపియా….   అసైన్డ్   భూములను     పామ్  ల్యాండ్    ప్లాట్లుగా  ‌మార్చుతున్నారు‌‌‌‌…  గజానికి   ఆరువేల. చోప్పున అమ్మకాలు  చేస్తున్నారు.. కోనుగోలు దార్ల. కోంపలను  ముంచుతున్నారు.. అక్రమ వేంచర్లతో    ప్రజలను    దోపిడీ చేస్తున్నా  .ఆ మాపియా    పై చర్యలు తీసుకోవడంలో     అదికారులు ఎందుకు చేతులు ఎత్తేశారు..మంచిర్యాల జిల్లాలో రియల్ మాపియ రాజ్యం పై  ప్రత్యేక కథనం

.  మంచిర్యాల జిల్లాలో  రియల్ మాపియా ప్రచారం…‌అంత ఇంతకాదు… మేట్రో నగరాలను  తలదన్నేలా  వసతులంటూ  గ్రాపిక్స్    డిజైన్ లతో  అర్బాట.  ప్రచారం‌ చేస్తోంది.. పైగా  ఆ   వెంచర్లు  మారుమూల.  ప్రాంతంలో ఉన్నాయి..  ఆ వెంచర్లకు   మట్డిరోడ్లు  లేవు..‌కాని  జాతీయ రహదారి  ప్రక్కన నుండి వెళ్లుతుందనే   ప్రచారం…పామ్  లాండ్     కోనుగోలు  చేస్తే చాలు… కోటీశ్వరులవుతారని  రియల్ మాపియా  ‌మంచిర్యాల జిల్లాలో   భూమ్   స్రుష్టిస్తోంది..

  అలాంటి   రియల్     భూమ్  స్రుష్టించిన వాటిలో   జైపూర్ మండలం    ఒకటి.‌.  ఇక్కడ  రియల్   ఎస్టేట్  వ్యాపారం మేట్రో నగరాలను  మరిపిస్తోంది.. జైపూర్   ను   అనుకోని     ఐదు , ఆరు కిలోమీటర్ల దూరంలో‌‌‌ముప్పై  ఏడు వేంచర్లు ఉన్నాయి.. రియల్ ఎస్టేట్  వేంచర్లు, పామ్  ల్యాండ్     వేంచర్లు   కలిపితే  వంద వరకు ఉన్నాయి.. ఇందులో  ఒక్కోక్క. వేంచర్  ముప్పై  ఎకరాల విస్తీర్ణంలో   విస్తరించి ఉన్నాయి..  కాని   డిటిసీపీ    అనుమతులు పోందిన. వెంచర్  ఒకటి‌మాత్రమే ఉంది

… మిగితా వేంచర్లు అన్ని    అక్రమమే…నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయి… పామ్  ల్యాండ్     దందా అడ్డగోలుగా     సాగుతోంది…  రెండున్నర గుంటలు   ముప్పై లక్షలకు అమ్ముతున్నారు…  కోనుగోలు చేసిన  భూమిలో  పెంచడానికి   ‌ముప్పై ఐదు  శ్రీ గందపు  చెట్లు ఇస్తున్నారు.. ఇచ్చినముప్పై  ఐదు పది సంవత్సరాలు పెంచితేచాలు  కోటి ‌ఇరవైలక్షలు   చెట్లకు వస్తాయని మాపియా చెబుతోంది… పైగా తామే   శ్రీ గందం చెట్లను  అమ్మిస్తామని   మాయమాటలతో ప్రజలను  నమ్మిస్తున్నారు.. అంతేకాదు ‌  పామ్ ల్యాండ్  చుట్డు సకల వసతులు  ఉన్నాయంటున్నారు.  స్విమ్మింగ్, ప్రక్రుతి అందాలను  తిలకించడానికి  వాచింగ్ టవర్స్,  రిసార్ట్, పార్క్   అన్ని  వసతులు కల్పిస్తామని   నమ్మిస్తున్నారు… అది నమ్మి   పామ్  ల్యాండ్     భూమిని     గజంకు   ‌ఆరువేల చోప్పున.  ప్రజలకు ,సింగరేణి  ఉద్యోగులకు అమ్ముతోంది‌ మాపియా.. ఒక్కొక్క ప్లాట్ ను  పదిహేను లక్షల కోనుగోలు చేస్తున్నారు.. పదేళ్ల కాలంలో  పెట్టిన  పెట్టుబడికి    కోటినర.   ఆదాయం  వస్తుందని  భ్రమపడి   ప్రజలు కోనుగోలు చేస్తున్నారు … ఎకంగా  మామిడి తోటలో  మట్టిరోడ్లు వేసి    పామ్   ల్యాండ్ దందా సాగిస్తున్నారు..

.. ఒకవైపు ‌పామ్  ల్యాండ్ ప్లాట్లు…‌మరోకవైపు వెంచర్ల దందా  సాగుతోంది… అటవీ భూములను,  సర్కారు భూములను, అసైన్డ్ భూములను, చెరువు   శిఖం  భూములను అక్రమిస్తున్నారు దోపిడీ దార్లు.. వెంచర్లను    వేస్తున్నారు… ఈ. వెంచర్లకు      రకరకాల. ప్రచారం   కల్పిస్తూ.. ఆ వేంచర్లలలో     ప్లాట్లను  ప్రజలకు  అమ్ముతున్నారు..  రియల్ మాపియా  వందలకోట్లు కోల్లగోడుతోంది..అయితే  ఈ దందాను అదికారులు  చూసిచూడనట్లుగా  వ్యవరిస్తున్నారని   ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.. శిఖం భూములు, సర్కారు భూములు అక్రమించి అనుమతులు  లేకుండా వెంచర్లు వేస్తున్నా  వారిపై పిర్యాదు చేస్తున్నా  పట్టించుకోవడం‌లేదని  అదికారుల తీరు పై ప్రజలు  మండిపడుతున్నారు..

మంచిర్యాల జిల్లాలో చెన్నూర్,   రామక్రిష్ణపూర్ లలో  అక్రమ వెంచర్లు, పామ్ ల్యాండ్  దందా   పై ఎంపిఓ. అరుణ్  కుమార్        వివరణ ఇచ్చారు..  అదికారులు అక్రమ వెంచర్లు ఉన్నాయని‌…అనుమతులు లేని వెంచర్లు ఉన్నాయని అంగీకరించారు..అలాంటి వెంచర్ల పై   చర్యలు  తీసుకుంటామని హెచ్చరించారు‌.. ప్రజలు  అనుమతులేని  అక్రమ  వెంచర్లలో ప్లాట్లు కోనుగోలు చేయవద్దని ప్రజలను కోరుతున్నారు

Leave A Reply

Your email address will not be published.