ముథోల్ గడ్డపై కమలం పాగావేయడం ఖాయమా?
బిఅర్ ఎస్ లో అసంత్రుప్తి సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వణుకు పుట్డిస్తోందా?

..ఆ నియోజకవర్గం లో కమలానికి ఊపుంది… బలం ఉంది..బలగం ఉంది…బరిలో నిలుస్తే ఓటమే స్వాగతం పలుకుతోంది.. కాని ఈసారి కారు కోటను కూల్చడానికి కషాయ దళం కోత్త ఎత్తుగడలు. వేస్తుంది? అ ఏత్తుగడలు బిఅర్ ఎస్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి విజయాత్రను కట్టడి చేస్తాయా?.. గులాబి దళంలో అసంత్రుప్తి… ప్రజల్లో వ్యతిరేకతతో విఠల్ రెడ్డికి ఓటమి తప్పదా? అసలు విఠల్ రెడ్డికి టిక్కెట్ దక్కుతుందా? మాజీమంత్రి వేణుగోపాల్ చారికి టిక్కెట్ దక్కుతుందా?ముథోల్ ఎన్నికల పోరులో నిలిచే కాంగ్రెస్ వీరుడేవ్వరు.. ముథోల్ నియోజకవర్గం లో మారుతున్నా రాజకీయ సమీకరణాల పై ప్రత్యేక కథనం
.
. నిర్మల్ జిల్లాలో ముథోల్ నియోజకవర్గం ఉంది.. ఇది ఒకప్పడు కాంగ్రెస్ కంచు కోట… ఆ కాంగ్రెస్ కోట కారు పార్టీకి సామ్రాజ్యంగామారింది.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బారీ అదిక్యతతో గత అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి విజయం సాదించారు… మళ్లీ రికార్డు స్థాయిలో మెజారిటీ సాదించి సత్తా చాటాలని ఎమ్మెల్యే విఠల్ రెడ్డితహతహలాడుతున్నారు..
నియోజకవర్గంలో ముథోల్ , బైంసా రూరల్ , బైంసా పట్టణం, కుబీర్, కుంటాల , లోకేశ్వరం , బాసర మండలాలు ఉన్నాయి..వీటిలో 2,26,725 మంది ఓటర్లు ఉన్నారు. ప్రదానంగా నియోజకవర్గం లో మున్నూరు కాపు,ముస్లిం, లంబడా, మరాఠా , ఓటర్లు ఉన్నాయి. ఈ సామాజిక వర్గాల. మద్దుతుతోగడ్డేన్నగారి విఠల్ రెడ్డి 2014లో కాంగ్రెస్ నుండి గెలుపోందారు…మారిన. రాజకీయ పరిస్థితులతో టిఅర్ ఎస్ లో చేరారు. , 2018లో జరిగిన. ఎన్నికలలో 83,933ఓట్లతో 46%ఓట్లు సాదించారు.. బిజెపి నుండి పోటీ చేసిన రమాదేవి 40,602ఓట్లతో 22% ఓట్లు సాదించారు. రమాదేవి పై 43,331 మేజారీటీ రికార్డుస్థాయిలొ విజయం సాదించారు విఠల్ రెడ్డి..మళ్లీ ముచ్చటగా మూడోసారి విజయం సాదించాలని తహతహలాడుతున్నారు
రెండుసార్లు ఎమ్మెల్యే గా గ్రామీణ ప్రాంతంలో రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించారు.. అదేవిధంగా ముథోల్,బైంసా అసుపత్రులలో బెడ్ల సంఖ్య పెంచి రోగులకు వైద్య సేవలు మేరుగుపరిచారు…పల్సికర్ రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో ముంపుకు గురైనా గుండేగామ్ గ్రామస్తులకు పరిహరం మంజూరు చేయించారు.. అదేవిదంగా బాసర. మాస్టర్ ప్లాన్ కోసం యాబై కోట్లు మంజూరు చేయించారు..అభివృద్ధి పథకాలతో పాటు విఠల్ రెడ్డి ప్రజల్లో సౌమ్యుడిగా మంచి పేరుంది..
... కాని అదికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నా అభివృద్ధి చేసింది…అణువంత మాత్రమేనని విమర్శలు ఏదుర్కోంటున్నారు…ప్రాణహిత చేవేళ్ల 28 వ ప్యాకేజీ తోనియోజకవర్గం లో సాగునీటి కోసం అప్పట్లో కాల్వలు తవ్వారు…గత కాంగ్రెస్ హయంలో ఏలా ఉన్నాయో ఇప్పుడు కూడా అదేవిధంగా కాల్వలు కనిపిస్తున్నాయి… 28 ప్యాకేజీ పనులు పురోగతి లేదు.. రైతులకు సాగునీరు అందడం లేదు…అదేవిధంగా గుండేగామ్ ప్రజలకు పునరావాసం క్రింద నిదులు మంజూరైనా …బాదితులకు పరిహరం అందలేదు.. పైగా బాదితులు కోరినవిదంగా పరిహరం ఇవ్వడంలేదని ఎమ్మెల్యే తీరుపై బాదితులు అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నారు… అదేవిధంగా బాసర టేంపుల్ సీటీ అభివృద్ధి విషయం లో ఎమ్మెల్యే మాటలు కోటలు దాటుతున్నాయి..నిదుల మంజూరుతో అడుగంతా అభివృద్ధి జరగడంలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి… ఇవన్నీ ఒక ఎత్తతే .బాసర ట్రిపుల్ ఐటి వివాదాల పుట్టగా మారింది.. స్థానిక ఎమ్మెల్యేగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో విపలంఅయ్యారని ఎమ్మెల్యే తీరు పై మండిపడుతున్నారు తల్లిదండ్రులు..
.. విఠల్ రెడ్డి వైపల్యాలతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది… సమస్యల పై అట్టిముట్డనట్లుగా ఉండే ఎమ్మెల్యే తీరు ప్రజలకు నచ్చడంలేదట.. దీనితో పాటు పార్టీలో అసంతృప్తి పెరుగుతోంది… విఠల్ రెడ్డి పై ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో ముథోల్ ఎమ్మెల్యే టిక్కెట్ మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్ వారి తనకు ఇవ్వాలని కోరుతున్నారు… టిక్కెట్ రేసులో చారి, ఎమ్మెల్యే పోటీపడుతున్నారు. చారిని ఇటీవల ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా సర్కార్ నియమించింది.. అయినప్పటికీ కూడ. చారి ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తుండటం విశేషం ..ఈ ఇద్దరిలో ఎవరికి టిక్కెట్ దక్కుతుందోనని గులాబీ పార్టీలో అసక్తి రేపుతోంది…కాని మంచి పలుకుబడితో తనకే టిక్కెట్ దక్కుతుందని విఠల్ రెడ్డి బావిస్తున్నారు..
.. అయితే విఠల్ రెడ్డి పై ప్రజల్లో వ్యతిరేకత ఉండటంతోపాటు… ముథోల్ నియోజకవర్గం లో బిజెపి బలమైన ఓటు బ్యాంకు ఉంది… గత రెండు అసెంబ్లీ ఎన్నికలలో నియోజకవర్గంలో బిజెపిపట్టుందని నిరూపితమైంది…దీనికి తోడు బైంసా మున్సిపల్ లో ఎంఐఎం కి పట్టుంది… ఎళ్లుగా మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోని పాలన సాగిస్తోంది.. ఎంఐఎం పాలనకు వ్యతిరేకంగా హిందూ సానుభూతి ఓటర్లు బిజెపికి మద్దతు పలుకుతుండటం విశేషం.. ఇక్కడ. బిజెపి కంటే హిందువాహిని బలంగా ఉంది… ఇక్కడి నుండి రెండు సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు బిజెపి అభ్యర్థి రమాదేవి.. అయితే బిజెపికి నియోజకవర్గం లో ఊపు పెరిగింది… ఇటీవల బండిసంజయ్ పాదయాత్ర నియోజకవర్గం లో పార్టీకి బలాన్ని పెంచింది…గెలుపు ఖాయమనే బావన పార్టీ నాయకులలో పెరిగింది..ఒకవైపు సంజయ్ పాదయాత్ర, మరోవైపు కాంగ్రెస్ మాజీ డీసీసీ అధ్యక్షుడు రామరావు పటేల్, మోహన్ రావు పటేల్ పార్టీలో చేరారు… రమాదేవి తో పాటు ఈ ఇద్దరు కూడ టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు …పార్టీ అభ్యర్థులుగా ప్రకటించకపోయినా ప్రజల్లో కి ముగ్గురు వెళ్లుతున్నారు..ప్రజల మద్దతు కూడగడుతున్నారు. ఎన్నికలలో పోటీ చేసి విఠల్ రెడ్డి పై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్దమవుతున్నారు… ముగ్గురు టిక్కెట్ కోసం సాగిస్తున్నా పోరు పార్టీని బలహీనం చేస్తోంది..ఏవరికి వారు పోటీ పడి ఈ ముగ్గురు నాయకులు పార్టీని బలహీనం చేస్తున్నారని కార్యకర్తలు అందోళనచెందుతున్నారు. ఈ ముగ్గురు కలిసి పార్టీ టిక్కెట్ ఇచ్చిన అభ్యర్థి కోసం పనిచేయకపోతే ఓటమి తప్పదని పార్టీ వర్గాలే ద్రువీకరిస్తున్నాయి..
రామారావు పటేల్ కాంగ్రెస్ వీడటంతో ఆ పార్టీకి పోటీ చేసే అభ్యర్థి కరువయ్యారు…ద్వితీయ. శ్రేణి నాయకులే పోటీ దిక్కు అన్నట్లు చందంగా మారింది…. బలమైన అభ్యర్థి కోసం పార్టీ పెద్దలు అన్వేషణ సాగిస్తున్నారు.. మరి పార్టీ అభ్యర్థి ఏవరు అవుతారో అనేది అసక్తి రేపుతోంది… బిజెపి టిక్కెట్ పంచాయితీ తనకు అనుకూలంగా ఉందని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అంచనా వేసుకుంటున్నారు… బిజెపి టిక్కెట్ పోరు ఎంఐఎం మద్దతు లబిస్తే, సంక్షేమ పథకాలతో విజయం సాదించడం ఖాయమని భావిస్తున్నారు ఎమ్మెల్యే… బిజెపి మాత్రం హిందూ ఓటు బ్యాంకు, ఎంఐఎం వ్యతిరేక ఓట్లు, సర్కార్ వైపల్యాలు విజయానికి చెరువచేస్తాయని అంచనా ఉంది…ఈసారి ఆరునూరైనా ముథోల్ గడ్డ పై కమలం జెండా ఎగురడం ఖాయమంటున్నారు ఆ. పార్టీ నాయకులు…మరి ఈమూడు పార్టీలలో ఏవరు విజయం సాదిస్తారో చూడాలి