తుడుం దెబ్బరాష్ట్ర అద్యక్షునిగా మళ్లీ ఎంపి సోయం బాపురావు?
తుడుం దెబ్బ. అధ్యక్ష.పదవి కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నా సోయం

ఆదిలాబాద్
ఆ సంఘం రాజకీయ. జీవితానికి ప్రాణంపోసింది…. పదవితో పట్టాబిషేకం చేసింది.. ఉద్యమ. దండును కదిలించింది… గూడాలలో చైతన్యాన్ని రగిల్చింది… ఓసారి ఎమ్మెల్యే ను చేసింది… మరోసారి ఎంపిని చేసింది… కాని రాజకీయ జన్మచ్చిన. తుడుం దెబ్బకు ఎంపి రాజీనామా చేశారు… ఉద్యమ కాడిని దించారు.. ఉద్యమ కాడిని దించిన ఎంపికి అండగా నిలిచే అదివాసీలు దూరమయ్యారు…రాజకీయంగా బలహీనమయ్యారు..బలగం లేని నాయకుడు మళ్లీ తుడుం దెబ్బ సారథి కావాలనుకుంటున్నారు..సోయంబాపురావు తుడుం దెబ్బ అద్యక్ష పదవిని దక్కించుకోవడానికి ఎందుకు పావులు కదుపుతున్నారు… అదివాసీల మద్దతు కోసం ఏందుకు అరాటపడుతున్నారు? లేదంటే మళ్లీ అదివాసీ ఉద్యమాన్ని అగ్గిరాజేయడానికి ఎత్తుగడలు వేస్తున్నారా? అదివాసీ సంఘం అధ్యక్ష పదవి కోసం బాపురావు అరాటం పై ప్రత్యేక. కథనం
అదివాసీ ఉద్యమ నాయకుడు ఆదిలాబాద్ ఎంపి సోయం బాపురావు… గోండు సామాజిక వర్గానికి చెందిన వారు.. అదివాసీల చైతన్యం కోసం.. లంబడాలను ఎస్టీ జాబితా నుండి తోలగించాలని ఉద్యమాన్ని రగిల్చిన. సంస్థ… ఆ సంస్థపేరు అదివాసీ తుడుం దెబ్బ. సంఘం…ఈ సంస్థ. వ్యవస్థాపక సభ్యుల్లో సోయం బాపురావు ఒకరు… అదేవిధంగా ఎడాదినర క్రితం వరకు ఉద్యమ. సారథిగా పనిచేశారు.
. ఉద్యమ సారథిగా నాలుగు సంవత్సరాల పాటు గల్లీ నుండి డిల్లీ దాకా ఉద్యమం చేశారు…లంబడాలను ఎస్టీ జాబితా నుండి తోలగించాలని పోరాటం సాగించారు… ఆ. ఉద్యమంతో అదివాసీలలొ బలమైన నాయకుడిగా గుర్తింపు పోందారు…
… ఆ ఉద్యమ గుర్తింపు తోనే,…. ఒకసారి బోథ్ నుండి 2004లో ఎమ్మెల్యే గా గెలుపోందారు.. 2019. లో బిజెపి ఎంపి అభ్యర్థిగా ఎన్నికల రంగంలో దిగారు…అదివాసీల. ఎకపక్ష ఓట్లతో అనుహ్యంగా ఎంపిగా విజయం సాదించారు.. ఆతర్వాత. పార్లమెంటు లో లంబడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని పోరాటం చేశారు… కాని ఏడాది నర క్రితం తుడుం రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు… పదవి నుండి వైదోలగారు .. ఉద్యమం నుండి వైదోలగడం అదివాసీలకు ఎంపి పై తీవ్రమైన. అసంతృప్తికి గురిచేసిందట.. ఉద్యమ కాడిని దించడం పై అదివాసీలు అసంతృప్తి తో రగిలిపోతున్నారట.. ఉద్యమం పై పక్కకు వైదోలగడం పై అదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట… ఒకప్పుడు ఉద్యమ నాయకునిగా అండగా నిలిచిన వాళ్లంతా ఎంపి సోయంకు దూరమయ్యారట.
. రాబోయే ఎన్నికలలో కమలం పార్టీ అభ్యర్థిగా ఎంపిగా బరిలో దిగిన అదివాసీలు అండగా నిలబడే పరిస్థితులు లేవట… పైగా మోసం చేశారని ఎంపి తీర పై పుడమి బిడ్డలు ప్రతికూలంగా మారరట… పోటీ చేసిన. ప్రతికూల పలితాలు తప్పదని సర్వేలలో తెలిందట… అండగా నిలిచి అదివాసీలు దూరం కావడం ఎంపికి దడ పుట్టిస్తుందట. ఒకప్పుడు ఒక పిలుపునిస్తే చాలు.. సమావేశాలకు వేలాది మంది తరలివచ్చే వారట… కాని తుడుందెబ్బ. అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత. అదివాసీలు దూరమయ్యారట… ఇదే పరిస్థితి కోనసాగితే రాజకీయంగా ఎదురు దెబ్బలు తప్పవని అందోళన చెందుతున్నారట..
…అందుకే దూరమైనా తన సామాజిక. వర్గానికి దగ్గర కావాలని బావిస్తున్నారట.. దూరమైనా అదివాసీల మద్దతు కూడగట్టడానికి కొత్త ఎత్తుగడలు వేస్తున్నారట… అందులో బాగంగా తుడుం దెబ్బ రాష్ట్ర అద్యక్ష పదవి మళ్లీ చెపట్టాలని బావిస్తున్నారట. ఈ ప్రక్రియలో బాగంగా తనకు పదవికి మళ్లీ అప్పగించాలని కోరుతున్నారట.. సోయం తనకు అనుకూలురైనా వారిచేత పదవి దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారట
పదవిని అప్పగిస్తే చాలు అదివాసీల. హక్కుల కోసం మళ్లీ పోరాటం సాగిస్తానని అంటున్నారట.. కాని ఎంపికి తుడుం దెబ్బ పదవి అప్పగించడానికి ఆయన వ్యతిరేక వర్గం అనుకూలంగా లేదట… అయినప్పటికీ ఆరునూరైనా పదవి దక్కించుకోవాలని ఎంపి బావిస్తున్నారట…లేదంటే తుడుందెబ్బను జాతీయ స్థాయిలో విస్తరిస్తారట… దానికి అద్యక్షుడు అవుతానని ప్రచారం చేసుకుంటున్నారట. మరి ఎంపి ప్రయత్నాలు నేరవేరుతాయో లేదో చూడాలి
.