రైతు కుటుంబానికి ధీమా

అదిలాబాద్ రూరల్: మండల్ తంతోలి గ్రామానికి చెందిన కొత్తూరు ఆశన్న రైతు, ఇటీవల తాను మరణించడం తో రాష్ట్ర ప్రభుత్వం రైతు కుటుంబానికి అండగా నిలబడుతూ ఇచ్చినటువంటి రైతు బీమా 5 లక్షల రూపాయల చెక్కును మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే జోగు రామన్న అందజేశారు.. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతాంగం రైతాంగం వ్యవస్థ మీద విసుకు చెందకుండా వారికి అన్ని విధాలా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటూ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుందన్నారు రైతు బీమాతో ఆ కుటుంబానికి ధీమాగా ఉంటూ ప్రభుత్వంపై విశ్వాసాన్ని పెంచుతుందన్నారు.. ఈ కార్యక్రమంలో ఆత్మ డైరెక్టర్ జిట్టా రమేష్, కుమ్రా రాజు, రమేష్, మాజీ ఎంపీపీ జగదీష్, అష్రాఫ్ పాల్గొన్నారు..