బెల్లంపల్లి నియోజకవర్గం బిఎస్పీ అధ్యక్షుడిగా దాసారపు రాజు

బెల్లంపల్లి : బహుజన్ సమాజ్ పార్టీ, బీ ఎస్ పి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం బిఎస్పీ పార్టీ అధ్యక్షుడిగా కాసిపేట మండలానికి చెందిన న్యాయవాది దాసారపు రాజునియమితులయ్యారు.ఈ మేరకు నియామక ఉత్తర్వులను మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఎం.వి.గుణ, జిల్లా ఇంచార్జ్ జాగిర్ రాజేష్ తో కలిసి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దాసారపు రాజు మాట్లాడుతూ.. తెలంగాణలో బహుజనుల బతుకులు మార్చడానికి డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తో కలిసి బహుజనులను ఐక్యం చేసి, బహుజన రాజ్యాధికారం కోసం నిబద్ధతతో కృషి చేస్తానన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి బిఎస్పీ పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తాననిఆయన తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.