పోలీస్ బెటాలియన్ లో సుందరీకరణ పనులు ప్రారంభిస్తాం
మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్

ఆదిలాబాద్ : యాపల్గూడ లోని పోలిస్ బెటాలియన్ లో అవసరమైన సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేసేలా తగు చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ పేర్కొన్నారు. ఇటివల బెటాలియన్ లో జరిగిన ఓ కార్యక్రమానికి ఎమ్మెల్యే జోగురామన్న హాజరై అభివృద్ధి పనుల విషయమై హామీ ఇవ్వగా… శుక్రవారం బెటాలియన్ ను సందర్శించి స్థానిక అధికారులతో వివిధ అంశాలపై చర్చించారు. పొలిసు అధికారులు, సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చేపట్టవలసిన అభివృద్ధి పనులతో సహా.. సుందరీకరణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. త్వరలోనే పనులు ప్రారంభించి నిర్దేశిత సమయంలో పూర్తి చేసేలా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈమేరకు మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ మాట్లాడుతూ…. బెటాలియన్ లో చేపట్టవలసిన పనుల విషయాన్ని ఇటివల ఎమ్మెల్యే జోగురామన్న దృష్టికి తీసుకురాగా… వాటిని పూర్తీ చేసేందుకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. త్వరలోనే పనులకు సంబంధించిన ప్రతిపాదనలు పంపి టెండర్ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ గండ్రత్ రమేష్ .సర్పంచ్ పెందూర్ గంగారాం, నాయకులూ కుమ్ర రాజు, ఆరే నరేష్. ఈ అరుణ్ తదితరులు పాల్గొన్నారు.