పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్ర‌భుత్వ ల‌క్ష్యం

ఎమ్మెల్యే జోగురామన్న

ఆదిలాబాద్‌: పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచుతూ ఇబ్బంది తలెత్తకుండా చూస్తున్నామని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో బుధవారం ఫాకో మిషన్ ను ఎమ్మెల్యే లాంచనంగా ప్రారంభించారు. వర్చువల్ విధానం ద్వార రాష్ట్ర వైధ్యారోగ్య శాఖా మంత్రి హరీష్ రావు హైదరాబాద్ నుండి సమావేశాన్ని ఏర్పాటు చేసి పది జిల్లాల్లో మిషన్ లను ప్రారంభించారు. వైధ్యరోగ్య శాఖలో అమలు చేస్తున్న నూతన సంస్కరణలు, సాధించిన పురోగతిని వివరించారు. రిమ్స్ లో మెరుగైన సేవలు అందుబాటులోకి తెస్తున్నందున ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియచేశారు. అనంతరం కంటి ఆపరేషన్ ల నిమిత్తం అందుబాటులోకి తెచ్చిన ఫాకో మిషన్ ను ప్రారంభించారు. పరికరం పని తీరును డాక్టర్ ఇద్రిస్ అక్బాని ఎమ్మెల్యేకు వివరించారు. . ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ…. అధునాతన పరికరాలతో వైద్య సేవలందించడానికి గానూ ఫాకో మిషన్ ను అందుబాటులోకి తేవడం జరిగిందని తెలిపారు. కంటికి సంబంధించిన ఆపరేషన్ లు ఇకపై సులభతరం కానున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో వైధ్యారోగ్య రంగంలో ప్రభుత్వం అనేక సంస్కరణలను అమలు చేస్తోందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఆర్ ఎంఓ తోడసం చందు, దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.