నిండు గర్బీణీని చంపేందుకు అత్తమామల కుట్ర

. ప్రేమ పెళ్లి పాపమైంది….అత్తకు నచ్చలేదు… నచ్చని కోడల్ని అంతం చేయాలని పథకం రచించారు..నిండు గర్బిణి అని చూడకుండా మ్యాంగో జ్యూస్ లో మందు కలిపింది..ప్రాణాలు తీసేందుకు కోడలుకు విషపు మందును త్రాగించింది…ఆ విషపు మందు త్రాగిన కోడలు అసుపత్రి పాలైంది.. కడుపులో బిడ్డ. కన్నుతెరవకుండానే కన్నుమూసింది…?కిరాతక. అత్తమామ లపై ప్రత్యేక కథనం
కుమ్రంబీమ్ జిల్లా సిర్పూర్ టి మండలం కేశవపట్నం గ్రామంలో దారుణం జరిగింది..కూతురిలా కోడలను చూసుకోవాల్సినా అత్తమామలు బరితెగించారు.. తనకోడుకుని ఇష్టం పెళ్లి చేసుకుందని నిండు గర్బీణీ అని చూడకుండా కోడలి పై హత్యయత్నానికి ఓడిగట్టారు… నిండు గర్బీణీ కోడలు. కవిత.. మరికొద్ది రోజలలో పండంటి పాపకు జన్మనివ్వనున్నది..అలాంటి నిండు గర్బీణిని అంతం చేయడానికి మ్యాంగో జ్యూస్ లో విషపు మందు కలిపారు…ఆ మందును కోడలికి త్రాగించారు
. మందుత్రాగిన వెంటనే నిండు గర్బీణి రక్తం కక్కింది… స్ప్రుహకోల్పోయింది కవిత.. దాంతో వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స కోసం అసుపత్రికి తరలించారు…. అక్కడే చికిత్స పొందుతూ కవిత పాపకు జన్మనిచ్చింది.. విషంప్రబావం వల్ల మూడు రోజుల తర్వాత.శిశువు ప్రాణాలు కోల్పోంది…కవిత. అసుపత్రిలో చావుబ్రతుకుల మద్య కోట్టుమిట్టాడుతోంది…ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు తనను చంపడానికి జ్యూస్ లో విషంకలిపారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు
.. అయితే కవిత, కోట మహేందర్ గత. కోన్ని సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు…శారీరకంగా కలిసి ఉన్నారు.. దాంతో కవిత గర్బం దాల్చింది..గర్బణానికి కారణమైన. మహేందర్ ను పెళ్లి చేసుకోవాలని కవిత కోరింది.. కాని పెళ్లి చేసుకోవడానికి మొదట మహేందర్ , ఆయన తల్లిదండ్రులు ఒప్పు కోలేదు… ఆతర్వాత పెద్దలు కౌన్సిలింగ్ ఇచ్చారు… కౌన్సిలింగ్ తర్వాత. మహేందర్ కవితను వివాహం చేసుకున్నారు..
. పెళ్లి చేసుకున్నా మహెందర్ కు, ఆయన తల్లి విమల, తండ్రి లాహ్యకు ఇష్టం లేదు.. ..పైగా డెలివరీ తర్వాత పుట్టబోయే బిడ్ట తమకు వారసురాలుగామారుతుందని…..అందువల్ల. కవితను డెలివర కాకముందే అంతం చేయాలని ప్రణాళిక రచించారు… అందులో బాగంగా భర్త మహెందర్ జ్యూస్ లో ఇంట్లో ఉన్న విషాన్ని కలిపారు… ఆ విషపుజ్యూస్ ను కవిత పుట్టింట్లో. తల్లిదండ్రులు ఏవరు లేని సమయంలో అత్త విమల కోడలకు త్రాగించింది..అది వికటించి కవిత. స్ప్రుహ తప్పిపడిపోయింది…… కవితను అసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు…ప్రస్తుతం కోలుకుంటున్నది..ఈ హత్యను పాల్పపడిన విషయాన్ని మహేందర్, ఆయన. తల్లిదండ్రులు పోలీసులు ముందు అంగీకరించారు… దాంతో నిందితులను అరెస్టు చేసిన. రిమాండ్ కు తరలించామన్నారు సీఐ స్వామి