విద్యుత్ తీగ తెగిపడి గేదె మృతి

జైనథ్:మండలంలోని గిమ్మ గ్రామంలో శనివారం ఉదయం 33/11 కెవి విద్యుత్ తీగ తెగిపడి గ్రామానికి చెందిన మాదని అనిల్ కుమార్ అనే రైతుకు చెందిన గేదె మృతి చెందడం జరిగింది. రైతు గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి మేత మేయడానికి వెళ్లి వచ్చిన గేదెను ఇప్పటిలాగే పశువుల పాక ఖాళీ స్థలంలో గేదెను కట్టి వేయడం జరిగింది. విద్యుత్ తీగ తెగిపడి గేదెపై పడడంతో గేదె అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఈ విషయంపై గిమ్మా పశువైద్యాధికారి సిద్ధార్థ,విద్యుత్ శాఖ లైన్మెన్ ఎల్లయ్య , గ్రామ విద్యుత్ ఆపరేటర్ సోహెల్ కు లిఖితపూర్వకంగా విన్నవిన్చారు. విషయం తెలుసుకున్నావారు సంఘటన స్థలానికి చేరుకొని గేదెను పంచనామా నిర్వహించి నివేదికను జిల్లా పశువైద్యాధికారులకు అందించారు. గేదె విలువ 60000 ఉంటుందని అన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామ సర్పంచ్ కోల సుమ పరమేశ్వర్,ఎంపిటిసి కోల భోజన, రైతును కలిసి తగు న్యాయం చేసి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం చేసే విధంగా చూస్తామన్నా