అప్పుల ఊబిలో తెలంగాణ
బారీగా అప్పులు పెరిగాయన్నా కేంద్ర ఆర్థిక శాఖ.

ఢిల్లీ:
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గణనీయంగా అప్పులు పెరిగాయన్న కేంద్రం.రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఏటా పెరుగుతూనే ఉన్నాయని వివరాలు వెల్లడించిన కేంద్ర ఆర్ధిక శాఖ.2022 అక్టోబర్ నాటికి తెలంగాణ మొత్తం అప్పులు… రూ. 4,33,817.6 కోట్లు ఉన్నట్లు బహిరంగ పరిచింది కేంద్ర ఆర్ధిక శాఖ.
రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని కలిపి చేసిన అప్పుగా పేర్కొన్న కేంద్రం.
తెలంగాణ ఏర్పడిన. సమయంలో నాటి అప్పులు. 75,577 కోట్ల అప్పులు ఉన్నాయని…
2021-22 నాటికి అవి రూ. 2,83,452 కోట్లకు చేరాయన్న కేంద్ర ఆర్ధిక శాఖ
.2014-15లో రూ. 8,121 కోట్లు
,2015-16లో రూ. 15,515 కోట్లు
2016-17లో రూ. 30,319 కోట్లు
2017-18లో రూ. 22,658 కోట్లు
2018-19లో రూ. 23,091 కోట్లు
2019-20లో రూ. 30,577 కోట్లు
2020-21లో రూ. 38,161 కోట్లు
2021-22లో రూ. 39,433 కోట్లు
ఇవి కాకుండా…
రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లకు రుణాలు ఇచ్చినట్లు కేంద్ర ఆర్ధిక శాఖకు నివేదించిన ప్రభుత్వ రంగ బ్యాంకులు.
ప్రభుత్వ రంగ బ్యాంకులు, నాబార్డు, ఇతర కార్పొరేషన్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు… రూ. 1,50,365.60 కోట్లు తీసుకున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది
12 బ్యాంకుల నుంచి కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు… రూ. 1,30,365.60 కోట్లు
రూరల్ ఇన్ఫ్రాస్టక్చర్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి రూ. 8,871 కోట్లు మంజూరు కాగా… రూ. 7,144 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్న కేంద్రం.
వేర్ హౌస్ ఇన్ఫ్రాస్టక్చర్ ఫండ్ నుంచి రూ. 972 కోట్లు మంజూరు కాగా… రూ. 852 కోట్లు విడుదల చేశారని,
ఫుడ్ ప్రాసెసింగ్ ఫండ్ నుంచి 2015-16, 2016-17లో రూ. 28 కోట్లు మంజూరు కాగా… రూ. 10 కోట్లు విడుదల అయ్యాయని
నాబార్డ్ ఇన్ఫ్రాస్టక్చర్ డవలప్మెంట్ అసిస్టెన్స్ నుంచి… వివిధ పథకాల అమలు కోసం… రూ. 14,516.65 కోట్లు మంజూరు కాగా… ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 11,424.66 కోట్లు వినియోగించుకున్నట్లు కేంద్రం తెలిపింది.
కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లోకసభలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి