ఉట్నూర్ ఐటిడిఎ పై దాడి చేసిన అదివాసీలు
రెండు వాహనాలను ద్వంసం చేసిన అదివాసీలు

ఆదిలాబాద్ ఉట్నూరు
. అదివాసీల. ఉద్యమంతో ఐటిడిఎ. రణరంగంగామారింది… పోడు భూములు హక్కు పత్రాలు ఇవ్వాలని, పదకోండు కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడం పై అదివాసీలు తిరగబడ్డారు…అగ్రహం తో ఐటిడిఎ పై దాడులు చేశారు.. ఐటిడిఎ చైర్మన్ వాహనాన్ని బద్దలు చేశారు.. విధ్వంసాన్ని స్రుష్టించారు… అదివాసీల మరో ఉద్యమం పై ప్రత్యేక కథనం
… ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో అదివాసీల పోడు భూముల పోరు యుద్దాన్ని .మరిపించింది… పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, కోత్తగా ఎస్టీ జాబితాలో చేర్చిన పదకొండు కులాలను ఉపసంహరించాలని అదివాసీలు ఐటిడిఎ కార్యాలయం లోకి దూసుకవెళ్లారు…ఈ సందర్భంగా అదివాసీలకు , పోలీసులకు మద్య తోపులాట జరిగింది..పోలీసుల అడ్డుకోవడాన్ని నిరశిస్తూ అదివాసీలు అగ్రహంతో ఊగిపోయారు.. ఆ కోపంలోనే .ఐటిడిఎ చైర్మన్ లక్కేరావు వాహనం పై పెట్రోల్ పోసి నిప్పు అంటించడానికి ప్రయత్నించారు.. అయితే పోలీసులు అడ్డుకొవడంతో రాళ్లతో వాహన్ని ద్వంసం చేశారు….దాడిలో అధ్దాలు పగిలిపోయాయి… అక్కడే ఉన్నా మరోక టాటా సుమో పై అదివాసీలు దాడులు చేశారు.. ఆ .వాహనాన్ని కూడ ద్వంసం చేశారు… అయితేపట్టాలు ఇవ్వడంలో సర్కారు జాప్యం చేస్తుందని బావించి దాడి చేశారన్నారు.. పెట్రొల్ పోసి వాహనాన్ని తగలబెట్టడానికి యత్నించారని లక్కేరావు అందోళన వ్యక్తం చేశారు.
™
.హక్కు పత్రాలు కావాలని, ఎస్టీ జాబితా లో చేర్చాలని అసెంబ్లీలో చేసిన తీర్మానం ఉపసంహరించుకోవాలని ఉద్యమిస్తే… పోలీసులు అణచి వేయడంపై అదివాసీలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు… పోడు భూములకోసం ఐటిడిఎ. కార్యాలయాన్ని ముట్టడిస్తే పోలిసులు తమపై దాడులు చేస్తున్నారని అందోళన వ్యక్తం చేశారు..తాము సాగు చేసుకుంటున్నా భూములకు హక్కు పత్రాలు ఇచ్చేంత వరకు పోరాటం అగదంటున్నారు..అదేవిదంగా కోత్తగా ఎస్టీ జాబితాలో చేర్చాలని చేసిన తీర్మానం ఉపసంహరించుకోవాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు..లేదంటే ఉద్యమాన్ని ఉద్రుతం చేస్తామని హెచ్చారిస్తున్నారు అదివాసీలు
.. అయితే అదివాసీల ఉద్యమం తీవ్రమవుతుండటంతో ఐటిడిఎ పీఓ వరుణ్ రెడ్డి దిగివచ్చారు… అదివాసీలతో సంప్రదింపులు జరిపారు…ఈ సందర్భంగా రెండు వారాల్లొ అదివాసీలకు హక్కు పత్రాలు ఇస్తామని ప్రకటించారు . ..ఇరవై ఐదు వేల మందికి పట్టాలిస్తామన్నారు..పోడు సాగు చేసుకుంటున్నా ప్రతి ఒక్కరికి పట్టాలిస్తామని పీఓ అదివాసీలకు బరోసానిచ్చారు.దాంతో అదివాసీలు అందోళన విరమించారు..µ