సీఎం జగన్ ప్రయాణిస్తున్నా విమానంలో సాంకేతికలోపం

సమస్యను గుర్తించిన పైలట్...సురక్షితంగా గన్నవరం ఎయిర్ పోర్ట్ లో తిరిగిల్యాండింగ్

 

సీఎం ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం
సురక్షితంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో తిరిగి ల్యాండింగ్‌
ఢిల్లీ వెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

అమరావతి:
ఢిల్లీలో గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సదస్సు సన్నాహక సమావేశంకోసం ఢిల్లీ వెళ్తున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. సమస్యను గుర్తించిన పైలట్‌ తిరిగి గన్నవరం విమానాశ్రయానికి మళ్లించారు. ఢిల్లీ పర్యటనకోసం ముఖ్యమంత్రి, అధికారుల బృందం సాయంత్రం 5:03 గంటలకు టేకాఫ్‌ అయ్యింది. కాసేపటికే పైలట్‌ విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు. తిరిగి సాయంత్రం 5:27 గంటలకు గన్నవరంలో ల్యాండ్ అయ్యారు. సీఎం తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.