నిర్మల్ జిల్లాలో జమ్ముకాశ్మీర్ మరిపిస్తున్నా తాళ్ల బ్రిడ్జీ
పంటపోలాలకు వెళ్లడానికి తాళ్ల వంతేన నిర్మించిన. రైతు

కర్రలను పిల్లర్లుగా చేశారు.. తాళ్లని కేబుల్స్ గా మలిచారు.. .. పంటపోలాలకు వాగు దాటడానికి వారదిని నిర్మించారు.. ఆ బ్రిడ్జే అచ్చం అచ్చు గుద్దినట్లుగా కేబుల్స్ బ్రిడ్జిని మరిపిస్తోంది.. ఆ. తాళ్ల వంతేన రైతుల కష్టాలను దూరం చేసింది… ఆ నిర్మల్ జిల్లా లో జమ్ముకాశ్మీర్ ను మరిపించే తాళ్ల వంతేన పై ప్రత్యేక కథనం
నిర్మల్ జిల్లా భైంసా మండలం కత్ గామ్ ఉంది…. ఈ. గ్రామంలో సుద్దావాగు ఉంది..పైగా వాగు ఉప్పోంగి ప్రవాహిస్తోంది..వాగు అవతల వైపు పంటపోలాలు ఉన్నాయి,,.. ఎనిమిది వందల ఎకరాల భూమి ఉంది. ఆభూముల్లో రైతులు వరి , వివిద రకాల పంటలు సాగుచేస్తున్నారు… కాని వాగు దాటలాంటే సహసం చేయాలి .. వాగు దాటేసమయంలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయారు.. కోందరు లోతైనావెళ్లుతూ బండరాళ్లు తాకి కాళ్లు చేతులు విరిగిపోయాయి
ఈ ప్రాంతంలోబ్రిడ్జి కోసం పలుమార్లు ఎమ్మెల్యే, అధికారులకు విన్నవించినా ఫలితం దక్కలేదు. వాగులో ఎప్పుడు నీరు ఉండడంతో ఇబ్బంది పడుతున్న క్రమంలో నాగేష్ అనే రైతు తన సొంత ఖర్చుతో కేబుల్ బ్రిడ్జి నిర్మించారు.. తనతో పాటు ఇతర రైతులకు ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ ఆలోచన చేసినట్లు నాగేష్ తెలిపారు. ఇటీవల కాశ్మీర్ వెళ్లిన తను ఈ నిర్ణయం తీసుకున్నాడు.
కేబుల్ బ్రిడ్జి గుర్తుకొచ్చింది. గత వారం రోజులుగా తాడు, కట్టెలు, బల్లలతో కూడిన బ్రిడ్జి తయారు చేశారు. మొత్తం నిర్మాణం పూర్తి అయి ఈ బ్రిడ్జి మీదుగా రైతులు రాకపోకలు సాగిస్తున్నారు.
కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో దూరభారం తగ్గినట్లు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.