దమ్ముంటే నన్ను సస్పేండ్ చేయండి. పోంగులేటీ
బిఅర్ ఎస్ కు సవాల్ విసిరిన. పోంగులేటి

భద్రాద్రి జిల్లా
తన వర్గీయులను కాదు దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ అధిష్ఠానంకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు…భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న పొంగులేటి బీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు…వైరా నియోజక వర్గంలో లో తన వర్గీయులను సస్పెండ్ చేశారని.. ఒక వేళ సస్పెండ్ చేయాల్సి వస్తే నన్ను చేయాలనీ సవాల్ విసిరారు..
కొందరు సీనియర్ నాయకులు శ్రీనన్న ఏ పార్టీ లో వెల్లుతారని అభ్యర్థులను ప్రకటిస్తున్నారని చెప్పుకొస్తున్నారని..నాకు ఆ దమ్ము ఉందని .
నీను ఏ పార్టీలో వెళ్లిన నీను ప్రకటించిన వారే అభ్యర్థులు గా ఉంటారన్నారు ..నా మీద విమర్శలు చేస్తున్న వారు వారికి పార్టీ లో ఏ స్థానం ఉందో ముందు చూసుకోవలన్నారు..
మొన్న బిజెపి లో, నిన్న కాంగ్రెస్ లో, ఇప్పుడు వైఎస్ ఆర్ టిపిలో చేరుతానని ప్రచారం చేస్తున్నారు ..ఈ వేదిక నుంచి ఒక్కటే చెబుతున్నా…ప్రజల తీర్పు ప్రకారం పార్టీ మార్పు ఉంటుందన్నారు…ఎవరో తొందర పెడితే నీను నిర్ణయం తీసుకొనని సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెబుతానన్నారు…ఖమ్మం జిల్లా బీఅర్ ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధు కు సైతం పొంగులేటి కౌంటర్ ఇచ్చారు ..ఒక ప్రజాప్రతినిధి శ్రీనన్న గురించి కాంట్రాక్టుల గురించి మాట్లాడుతున్నారు నిజం గా మీరు వెయ్యి కొట్లా, రెండు వేల కొట్లా?? వర్కులు ఇచ్చి ఉంటే చర్చలకు నేను సిద్ధం…ఎవ్వరికి ఎంత ఇచ్చారో ఎవ్వరికి ఎంత లాభం చేసుకురిందో లెక్కలేంటో నేను చూపిస్తాను. మన బాగోతం ఏమిటో మనకు తెలియంది కాదన్నారు…ఏ రాష్ట్రం అయితే వస్తే తమ కష్టాలు తొలగిపోతాయనుకున్నారో ఇప్పుడు ఆ పరిస్తితిలు లేవన్నారు…9ఏళ్ల లో ఏ రకంగా అభివృద్ధి జరిగింది మనకు తెలియంది కాదన్నారు..అభివృద్ధి కేవలం ఫోటోలకే పరిమితమైందన్నారు..