బండి సంజయ్ ఇంటిముందు దర్నా చేస్తా ఎంపి సోయం
అదికారంలోకి వచ్చినతర్వాత బండి సంజయ్ కేస్లాపూర్ ను అభివ్రుద్ది చేయకపోతే ధర్నా చేస్తా

..దండుపాళ్యం ముఠాదిపతి…. పట్టాలతో పట్టాబిషేకం చేస్తమన్నారు.. పట్టాలు లేవు… సీఎం కేసీఆర్ పత్తాలేదు. అదివాసీలను మోసం చేసిన. సీఎం కేసీఆర్ కు రాబోయే ఎన్నికలలో బుద్ది చెప్పాలని తెలంగాణ బండి సంజయ్ పిలుపునిచ్చారు. జంగల్ కు మంగళం పాడుతున్నా వారి పై జంగ్ సైరన్ మ్రోగించారు కేంద్రమంత్రి అర్జున్ ముండా…అయితే అతిథిగా రమన్నారు… సమస్యలు పరిష్కరించకపోతే బండి సంజయ్ కు అడ్డం తిరుగుతామన్నారు ఎంపి.. సమస్యలు పరిష్కరించకపోతే
.బండి సంజయ్ ఇంటి ముందు ధర్నాకు దిగుతానని ఎంపి ఎందుకు హెచ్చరికలు జారీ చేశారు… కేంద్రమంత్రి అర్జున్ ముండా, బండి నాగోబా పర్యటన పై ప్రత్యేక కథనం
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవేల్లి మండలం కెస్లాపూర్ లో అదివాసీల నాగోబా దేవతను కేంద్రమంత్రి అర్జున్ ముండా , తెలంగాణ బిజెపి సారథి బండి సంజయ్ దర్శించుకున్నారు…హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో అర్జున్ ముండా, బండి సంజయ్ కెస్లాపూర్ కు చేరుకున్నారు.. పవిత్రమైన. నాగోబా జాతరలో పాల్గొనడానికి వచ్చిన. కేంద్రమంత్రి, బండి సంజయ్ కి గిరిజనులు ఘనస్వాగతం పలికారు… అచార. సంప్రదాయాలతో గిరిజన వాయిద్యాలతో అదివాసీలు ఆలయంలోకి అహ్వనం పలికారు… ఆలయంలో అర్జున్ ముండా, సంజయ్ ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు…ఆనంతరం ఈ. ఇద్దరిని ఆలయ మర్యాదలతో సన్మానించారు గిరిజనులు..
దర్శనాంతరం దర్బార్ లో నిర్వహించిన సభకు సంజయ్ , కేంద్రమంత్రి హజరయ్యారు…ఈ సందర్భంగా ఎంపి సోయంబాపురావు సభలోమాట్లాడారు…అదివాసీలు సాగుచేసుకుంటున్నా భూములకు హక్కులు లేవు. అదేవిధంగా గిరిజన మహిళలు ఎనిమియా తో అదివాసీ మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారని వాపోయారు… అదిలాబాద్
కు మంజూరైనా యూనివర్శిటీని వరంగల్ కు తరలించుకపోయారని వాపోయారు.. ఆ యూనివర్సిటీని ఆదిలాబాద్ కు రావడానికి కేంద్రమంత్రి , బండి సంజయ్ చోరవ చూపాలని ఎంపి కోరారు..అదేవిదంగా కెస్లాపూర్ అభివృద్ధి బండి సంజయ్ దే బాద్యతన్నారు..రాబోయే రోజులలో బిజెపి అదికారంలో వస్తుందన్నారు.. బిజెపి అదికారంలోకి వచ్చాక కెస్లాపూర్ అభివ్రుద్ది బండి చోరవ చూపకపోతే తానే బండి ఇంటిముందు ధర్నాను చేస్తానని బండి సంజయ్ కు చురకలు అంటించారు ఎంపి
బైట్ ఎంపి సోయంబాపురావు
ఎంపి ప్రసంగం ముగిసిన తర్వాత సభలో బండి సంజయ్ ప్రసంగించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతు సీఎం కేసీఆర్ అదివాసీలకు పట్టాలు ఇస్తామని హమీలు ఇచ్చారు…కుర్చీ వేసుకోని పట్టాలు ఇస్తామన్నా నాయకుడు పత్తాలేకుండ పోయారని సీఎం తీరు పై బండి మండిపడ్డారు.. అదేవిధంగా గిరిజనులకు డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వలేదన్నారు… అదేవిధంగా త్రాగునీటి కష్టాలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.. ప్రజలకు త్రాగునీరు అందించే మిషన్ భగీరథ. పథకం పూర్తి గా విపలమైందన్నారు.. గిరిజనుల. కష్టాలకు కారణమైన తెలంగాణ సర్కారు ను రాబోయే ఎన్నికలలో ఓడించాలని ప్రజలను కోరారు .. బిజెపి అదికారంలోకి రాగానే అదివాసీలకు పట్టాలు ఇస్తామన్నారు.. అదేవిధంగా గిరిజనుల నాగోబా జాతరను అట్టహసంగా నిర్వహిస్తామన్నారు బండి
.. బండి సంజయ్ ఆనంతరం కేంద్రమంత్రి అర్జున్ ముండా ప్రసంగించారు.. గిరిజనుల. సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ సర్కారు విపలమైందన్నారు..పోడు భూములకు హక్కులు లేవు.. కనీసం కమ్యూనిటీ రైట్స్ ఇవ్వడం లేదని సర్కారు తీరు పై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు..బిజెపి అదివాసీలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు..ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేసిన ఘనత బిజెపి కిదక్కుతుందన్నారు… తెలంగాణ లో అదికారంలోకి రాగానే పోడు భూములకు హక్కులు ఇస్తామన్నారు.. అదేవిధంగా నాగోబా దర్మశాలకు నిదులు మంజూరు చేస్తున్నామని మంత్రి గిరిజనులకు భరోసానిచ్చారు