మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై పాలాబిషేకం

అభిమానంతో పాలాభిషేకం‌ చేసినస్థానికులు కులు

మహబూబ్ నగర్

మంత్రి డా వి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తరుణంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బి కే రెడ్డి కాలనీకి చెందిన కౌన్సిలర్ ఆనంద్ కుమార్ గౌడ్, హర్షవర్ధన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బుక్క రవి సహా స్థానికులు మంత్రిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. మంత్రిపై పూల జల్లు కురిపించి… పాలాభిషేకం చేశారు. పట్టణంలోని ట్యాంక్ బండ్ వద్ద పార్టీ చేరికల అనంతరం మంత్రి వారించిన వినకుండా నాయకులు కార్యకర్తలు క్షీరాభిషేకం చేశారు. అభిమానులు కార్యకర్తలు జై శ్రీనన్న అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం మంత్రి ట్యాంక్ బండ్ నుంచి నేరుగా వార్డు పర్యటనకు బయలుదేరారు. బికే రెడ్డి కాలనీలో వీధులన్నీ కలియతిరిగారు. ఇంటింటికి వెళ్లి స్థానికులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీల సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, సిబ్బందికి చేపట్టాల్సిన పనుల వివరాలను మంత్రి తెలియచేశారు. మంత్రి వెంట మునిసిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ ఆనంద్ కుమార్ గౌడ్, అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.