ఉట్నూర్ లో పోలీసులు, అదివాసీల మద్యతోపులాట
గిరిజనుని దాడి చేసిన అటవీ అదికారి పై చర్యలు చేపట్టాలని డిమాండ్

®
కలలఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో ఉద్రిక్తత. అటవి డివిజనల్ అధికారి కార్యాలయం ముందు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆద్వర్యంలో ఆదివాసీల ఆందోళన నిర్వహించారు..ఈ సందర్భంగా పోలీసులు , అదివాసీల మద్య. తోపులాట. జరిగింది.నార్నూర్ మండలం నాగల్ కొండ గ్రామానికి చెందిన కోవ లింబరావ్ పై అటవీ అదికారులు దాడులు చేశారు.. దాంతో తీవ్రగాయాల పాలై అసుపత్రి పాలయ్యారు.. ప్రాణాపాయ స్థితికి చేరడానికి కారణమైన అటవీ అదికారుల పై చర్యలు చేపట్టాలని అదివాసీలు అందోళన చేపట్టారు.బాధితుడికి నాణ్యమైన వైద్యం అందించి కాపాడాలని, నిరుపేదైన అతని కుటుంబాన్ని ఫారెస్ట్ అధికారులే కాపాడాలని డిమాండ్. చేశారు అదివాసీలు.. సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపడుతామని డిఎప్ ఓ రాజశేఖర్ హమీ ఇవ్వడంతో అదివాసీలు అందోళన విరమించారు