పోంగులేటి, జూపల్లి పై వేటు వేసిన గులాబి పార్టీ
మాజీమంత్రి జూపల్లి క్రిష్ణరావు, మాజీ ఎంపి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సస్పేండ్ చేసిన పార్టీ

బీ ఆర్ ఎస్ జాతీయ అధ్యక్షులు శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది గులాబి పార్టీ.. సస్పెండ్ చేస్తున్నట్లు బీ ఆర్ ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు.
నిన్న భద్రాద్రి కొత్తగూడెం లో నిర్వహించిన. ఆత్మీయ సమ్మేళనంలో సీఎం కేసీఆర్ పై మాజీ ఎంపి పోంగులేటిశ్రీనివాస్ రెడ్డి, మాజీమంత్రి జూపల్లి క్రుష్ణరావు తీవ్రమైన ఆరోపణలు చేశారు.. తెలంగాణ సర్కార్ అన్ని రంగాలలో వైపల్యం చెందిందని మండిపడ్డారు.. పార్టీ పై దిక్కార స్వరం వినిపించడంతో పార్టీ స్పందించింది.. పార్టీ పై దిక్కార. స్వరం వినిపిస్తున్నా ఇద్దరు నాయకులను సస్పెండ్ చేశారు