యుద్దవీరులను దేవుళ్లుగా పూజిస్తున్నా అదివాసీలు
యుద్దవీరులకు మొక్కులు చెల్లిస్తున్నా గిరిజనులు యుద్దవీరుల. కోసం జాతర నిర్వహిస్తున్నా అదివాసీలు

..యుద్ధ వీరులే…అదివాసీల దేవుళ్లు… ఆ. యుద్ద వీరులను కోలుస్తున్నారు…..ఆ త్యాగాల యోదులను స్మరిస్తూ జాతరను నిర్వహిస్తున్నారు… అదివాసీలు యుద్ద వీరులను ఎందుకు పూజిస్తున్నారు…త్యాగాల యోదులు ఎందుకు దేవుళ్లుగా మారారు… యుద్ద వీరులను పూజిస్తున్నా అదివాసీల పై ప్రత్యేక స్టోరీ
ఆదిలాబాద్…..ప్రపంచంలో యుద్ధం వీరులను పూజించే ఏకైక జాతర… ఖామ్ దేవుని జాతర… యుద్ద వీరులను పూజిస్తూ అదివాసీలు పుష్యమాస్య లో జాతరను ఆదిలాబాద్ నార్నూర్ లో నిర్వహిస్తూ అందరికి స్పూర్తిని ఇస్తున్నారు తోడసం వంశీయులు
..ఖామ్ అంటే త్యాగాలు చేసిన అమరులుఅని అర్థమంటున్నారు… అయితే అదివాసీలు రాజ్ గోండులు.. దేశానికి స్వాతంత్ర్యం రాకముందు రాజ్యం ఎలిన వాళ్లు రాజ్ గోండులు.. చంద్రపూర్, ఉట్నూర్ , చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ప్రాంతాలను పాలించిన చరిత్ర ఉంది….అప్పట్లో యుద్దాలు జరిగిన. సమయంలో తమదేశానికి తోడసం వీరులు దేశం కోసం ప్రాణ త్యాగం చేశారు.. ఆ యుద్ద వీరులను స్మరించుకుంటున్నారు.. పూజలు చేస్తున్నారు అదివాసీ బిడ్డలు…కర్ర స్థంబాలను వీరులకు ప్రతీకలుగా పూజిస్తున్నారు … కర్ర స్థంబాల. వద్ద. ఆనాడు ఉయోగించిన కత్తులు, ఆయుదాలు , ఎనుగు విగ్రహం కూడ ఉంది. .. తమ. రాజ్యం కోసం అమరులైనా వారిని దేవుళ్లుగా భావిస్తున్నారు తోడసం వంశీయులు.. వీరులను పూజించడం ఇప్పటి నుండి పూజించడం లేదని…ఎళ్లుగా వస్తున్నా చల అచారాన్ని పాటిస్తున్నామంటున్నారు రిటైడ్ ఐటిడిఎ డిప్యూటీ డైరెక్టర్ తోడసం శాంతిరాం రాజ్
. అయితే తోడసం వంశీయలు వీరులను పూజిస్తున్నా ప్రాంతం లో తోడసం వంశీయుల అరాద్య దైవం పులి దేవునికి అలయంఉంది.. ఈ ఆలయంలో అదివాసీ బిడ్డలు పులిని దేవునిగా కోలుస్తూ పూజలు చేస్తున్నారు… పుడమి బిడ్డలు పులిని పూజిస్తూ అడవి బిడ్డలు అడుతున్నారు..పాడుతున్నారు ..దేవున్ని కోలుస్తూ భక్తి పారవశ్యంలో గిరిజనులు మునిగి తెలుతున్నారు..
… ఈ జాతరలో అత్యంత కీలకమైన ఘట్టం… తోడసం అడపడుచు నువ్వుల త్రాగే ఘట్టం.. తోడసం అడపడుచు రెండున్నర కిలోల నువ్వుల త్రాగే ఘట్డం… దేవుని మహిమతో నిమిషాల వ్యవదిలో నూనేను అవలీలగా త్రాగారు తోడసం అడ పడుచు. ఇదంతా దేవుని మహిమ వల్లే ఇది సాద్యమంటున్నారు తోడసం వంశీయులు… తోడసం వంశస్థులు దేశంలో ఎక్కడ ఉన్న. జాతర ఉత్సవాలలో పాల్గొనడానికి తరలివస్తున్నారు అదివాసీలు… పవిత్రమైన దేవున్ని పూజిస్తే చాలు కోరికలునేరవేరుతాయని అదివాసీ నాయకుడు శేఖర్ అంటున్నారు… ఈ సందర్భంగా అచారాలలో పాటిస్తున్నామని ఆయన అన్నారు.. భవిష్యత్తు తరాలకు స్పూర్తి నిచ్చే అచారాలు, సంప్రదాయాలు పాటిస్తున్నామని చెబుతున్నారు అదివాసీలు..